శ్రీనగర్‌ చేరుకున్న ఈయూ ఎంపీల బృందం

- October 29, 2019 , by Maagulf
శ్రీనగర్‌ చేరుకున్న ఈయూ ఎంపీల బృందం

శ్రీనగర్‌: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు ఐరోపా సమాఖ్య(ఈయూ) పార్లమెంటు సభ్యుల బృందం నేడు శ్రీనగర్‌ చేరుకుంది. 23 సభ్యులతో కూడిన ఈ ఎంపీల బృందం రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనుంది.

పర్యటనలో భాగంగా కశ్మీర్‌ లోయ, జమ్ముకశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లో తాజా పరిస్థితులను స్థానిక ప్రభుత్వ అధికారుల నుంచి తెలుసుకోనుంది. కొందరు స్థానికులతో కూడా ముచ్చటించి వారి నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. ఈ సందర్భంగా యూపీ ఎంపీ నథన్‌ గిల్‌ మాట్లాడుతూ.. 'విదేశీ ప్రతినిధులతో చర్చల నిమిత్తం కశ్మీర్‌కు వెళ్లే అవకాశం రావడం ఆనందంగా ఉంది. క్షేత్రస్థాయిలో అక్కడేం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ పర్యటన దోహదపడుతుంది' అని అన్నారు.

రాహుల్‌ విమర్శలు
మరోవైపు ఈయూ పార్లమెంట్‌ సభ్యుల బృందం జమ్ముకశ్మీర్‌ పర్యటనను విపక్ష నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. 'జమ్ముకశ్మీర్‌ పర్యటనకు యూరప్‌ ఎంపీలను అధికారికంగా స్వాగతించారు. కానీ భారత ఎంపీలను మాత్రం అడ్డుకుంటున్నారు. వారిపై నిషేధం విధిస్తున్నారు. ఇందులో ఏదో తప్పు జరుగుతోంది' అని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com