శ్రీనగర్ చేరుకున్న ఈయూ ఎంపీల బృందం
- October 29, 2019
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు ఐరోపా సమాఖ్య(ఈయూ) పార్లమెంటు సభ్యుల బృందం నేడు శ్రీనగర్ చేరుకుంది. 23 సభ్యులతో కూడిన ఈ ఎంపీల బృందం రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనుంది.
పర్యటనలో భాగంగా కశ్మీర్ లోయ, జమ్ముకశ్మీర్లోని ఇతర ప్రాంతాల్లో తాజా పరిస్థితులను స్థానిక ప్రభుత్వ అధికారుల నుంచి తెలుసుకోనుంది. కొందరు స్థానికులతో కూడా ముచ్చటించి వారి నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. ఈ సందర్భంగా యూపీ ఎంపీ నథన్ గిల్ మాట్లాడుతూ.. 'విదేశీ ప్రతినిధులతో చర్చల నిమిత్తం కశ్మీర్కు వెళ్లే అవకాశం రావడం ఆనందంగా ఉంది. క్షేత్రస్థాయిలో అక్కడేం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ పర్యటన దోహదపడుతుంది' అని అన్నారు.
రాహుల్ విమర్శలు
మరోవైపు ఈయూ పార్లమెంట్ సభ్యుల బృందం జమ్ముకశ్మీర్ పర్యటనను విపక్ష నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. 'జమ్ముకశ్మీర్ పర్యటనకు యూరప్ ఎంపీలను అధికారికంగా స్వాగతించారు. కానీ భారత ఎంపీలను మాత్రం అడ్డుకుంటున్నారు. వారిపై నిషేధం విధిస్తున్నారు. ఇందులో ఏదో తప్పు జరుగుతోంది' అని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్







