550వ జయంతి: పాక్లో గురునానక్ స్మారక నాణేల విడుదల
- October 30, 2019
ఇస్లామాబాద్: గురునానక్దేవ్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్ నానక్ స్మారక నాణేలను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఫొటోలను ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 'గురునానక్ జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేలను పాక్ విడుదల చేసింది' అని పేర్కొన్నారు.
కర్తార్పూర్ విషయమై గత ఏడాది నవంబర్లోనే భారత్-పాకిస్థాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, దీనిపై వారం క్రితం ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి కర్తార్పూర్లోని గురు ద్వారాను ఇది కలుపుతుంది. గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 9న కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. యాత్రికుల సౌకర్యార్థం దీన్ని ముందుగానే ప్రారంభిస్తున్నారు. పాకిస్థాన్లోని రావినది ఒడ్డున ఉన్న నారోవల్ జిల్లాలో కర్తార్పూర్ సాహిబ్ ఉంది. యాత్రికుల వసతి కోసం పాకిస్థాన్ 80 ఇమ్మిగ్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజుకు 5వేల మంది యాత్రికులను అనుమతించనుంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







