550వ జయంతి: పాక్లో గురునానక్ స్మారక నాణేల విడుదల
- October 30, 2019
ఇస్లామాబాద్: గురునానక్దేవ్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్ నానక్ స్మారక నాణేలను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఫొటోలను ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 'గురునానక్ జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేలను పాక్ విడుదల చేసింది' అని పేర్కొన్నారు.
కర్తార్పూర్ విషయమై గత ఏడాది నవంబర్లోనే భారత్-పాకిస్థాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, దీనిపై వారం క్రితం ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి కర్తార్పూర్లోని గురు ద్వారాను ఇది కలుపుతుంది. గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 9న కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. యాత్రికుల సౌకర్యార్థం దీన్ని ముందుగానే ప్రారంభిస్తున్నారు. పాకిస్థాన్లోని రావినది ఒడ్డున ఉన్న నారోవల్ జిల్లాలో కర్తార్పూర్ సాహిబ్ ఉంది. యాత్రికుల వసతి కోసం పాకిస్థాన్ 80 ఇమ్మిగ్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజుకు 5వేల మంది యాత్రికులను అనుమతించనుంది.
తాజా వార్తలు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!









