దక్షిణాసియా: ప్రపంచ వృద్ధి కేంద్రం దిశగా పరుగు
- November 04, 2019
వాషింగ్టన్: భారత్ నేతృత్వంలో దక్షిణాసియా ప్రపంచ వృద్ధి కేంద్రంగా అవతరించే దిశగా ముందుకు సాగుతోందని, 2040 నాటికి ప్రపంచ వృద్ధిలో మూడో వంతు భాగాన్ని అందించగలుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా పరిశోధన వెల్లడించింది. ఐఎంఎఫ్ చేసిన ప్రపంచ భౌగోళిక విభజనలో దక్షిణాసియాలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాలు లేవు. ఐఎంఎఫ్ చేసిన విభజన ప్రకారం, దక్షిణాసియాలో భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు ఉన్నాయి. దక్షిణాసియాలో సరళీకరణ విధానాల అమలు, మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడానికి పెరుగుతున్న కృషి, పనిచేసే సత్తా ఉన్న యువ జనాభా కారణంగా ఈ ప్రాంతం 2040 నాటికి ప్రపంచ వృద్ధిలో మూడో వంతు వాటాను అందించగలుగుతుందని ఐఎంఎఫ్ 'దక్షిణాసియా పైకి ఎగరటానికి సిద్ధంగా ఉందా? స్థిరమయిన, సంఘటిత వృద్ధి అజెండా' అనే శీర్షికతో రూపొందించిన పరిశోధనా పత్రం పేర్కొంది. ఐఎంఎఫ్ ఈ పరిశోధనా పత్రాన్ని సోమవారం ఢిల్లీలో విడుదల చేయనుంది. 'వృద్ధి పథం, అభివృద్ధి రెండు అంశాలలో చూస్తే, ఆసియాలోని మిగతా ప్రాంతాలకన్నా దక్షిణాసియా ప్రపంచ వృద్ధి కేంద్రంగా అవతరించడానికి ఎంతో వేగంగా ముందుకు సాగుతోంది' అని ఐఎంఎఫ్లోని ఆసియా, పసిఫిక్ డిపార్ట్మెంట్ డిప్యూటి డైరెక్టర్ అనే్న-మేరి గుల్డే వోల్ఫ్ పరిశోధనా పత్రం విడుదల కానున్న తరుణంలో ఒక వార్తాసంస్థకు తెలిపారు. ఐఎంఎఫ్ పరిశోధన ప్రకారం, దక్షిణాసియా లో 2030 నాటికి 150 మిలియన్ మంది లేబర్ మార్కెట్లోకి ప్రవేశిస్తారని గుల్డే వోల్ఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







