దక్షిణాసియా: ప్రపంచ వృద్ధి కేంద్రం దిశగా పరుగు
- November 04, 2019
వాషింగ్టన్: భారత్ నేతృత్వంలో దక్షిణాసియా ప్రపంచ వృద్ధి కేంద్రంగా అవతరించే దిశగా ముందుకు సాగుతోందని, 2040 నాటికి ప్రపంచ వృద్ధిలో మూడో వంతు భాగాన్ని అందించగలుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా పరిశోధన వెల్లడించింది. ఐఎంఎఫ్ చేసిన ప్రపంచ భౌగోళిక విభజనలో దక్షిణాసియాలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాలు లేవు. ఐఎంఎఫ్ చేసిన విభజన ప్రకారం, దక్షిణాసియాలో భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు ఉన్నాయి. దక్షిణాసియాలో సరళీకరణ విధానాల అమలు, మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడానికి పెరుగుతున్న కృషి, పనిచేసే సత్తా ఉన్న యువ జనాభా కారణంగా ఈ ప్రాంతం 2040 నాటికి ప్రపంచ వృద్ధిలో మూడో వంతు వాటాను అందించగలుగుతుందని ఐఎంఎఫ్ 'దక్షిణాసియా పైకి ఎగరటానికి సిద్ధంగా ఉందా? స్థిరమయిన, సంఘటిత వృద్ధి అజెండా' అనే శీర్షికతో రూపొందించిన పరిశోధనా పత్రం పేర్కొంది. ఐఎంఎఫ్ ఈ పరిశోధనా పత్రాన్ని సోమవారం ఢిల్లీలో విడుదల చేయనుంది. 'వృద్ధి పథం, అభివృద్ధి రెండు అంశాలలో చూస్తే, ఆసియాలోని మిగతా ప్రాంతాలకన్నా దక్షిణాసియా ప్రపంచ వృద్ధి కేంద్రంగా అవతరించడానికి ఎంతో వేగంగా ముందుకు సాగుతోంది' అని ఐఎంఎఫ్లోని ఆసియా, పసిఫిక్ డిపార్ట్మెంట్ డిప్యూటి డైరెక్టర్ అనే్న-మేరి గుల్డే వోల్ఫ్ పరిశోధనా పత్రం విడుదల కానున్న తరుణంలో ఒక వార్తాసంస్థకు తెలిపారు. ఐఎంఎఫ్ పరిశోధన ప్రకారం, దక్షిణాసియా లో 2030 నాటికి 150 మిలియన్ మంది లేబర్ మార్కెట్లోకి ప్రవేశిస్తారని గుల్డే వోల్ఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







