నవంబర్ నెలఖారున ధనుష్ కొత్త చిత్రం విడుదల!
- November 04, 2019
ధనుష్, మేఘా ఆకాష్ జంటగా గౌతమ్మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా' చిత్రాన్ని ఈనెల 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ధనుష్ అభిమానులు మాత్రం చిత్రం విడుదలపై ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. కారణం.. ఈ చిత్రం ఇప్పటివరకు పలు దఫాలు వాయిదాపడడమే. షూటింగ్ పూర్తి చేసుకుని దాదాపు రెండేళ్లు గడుస్తున్నా 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా' విడుదలకు నోచుకోలేదు. ఆర్థిక సమస్యల కారణంగా తెరవెనుకే ఉండిపోయింది. ధనుష్ తాజా చిత్రం 'అసురన్' అమోఘ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా'ను విడుదల చేసేందుకు గౌతమ్మేనన్, నిర్మాతలు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆ ప్రకారం నవంబర్ నెలాఖరున ఈ చిత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఈసారైనా మిస్సవకుండా ఈ చిత్రం థియేటర్లలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









