నవంబర్ నెలఖారున ధనుష్ కొత్త చిత్రం విడుదల!
- November 04, 2019
ధనుష్, మేఘా ఆకాష్ జంటగా గౌతమ్మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా' చిత్రాన్ని ఈనెల 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ధనుష్ అభిమానులు మాత్రం చిత్రం విడుదలపై ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. కారణం.. ఈ చిత్రం ఇప్పటివరకు పలు దఫాలు వాయిదాపడడమే. షూటింగ్ పూర్తి చేసుకుని దాదాపు రెండేళ్లు గడుస్తున్నా 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా' విడుదలకు నోచుకోలేదు. ఆర్థిక సమస్యల కారణంగా తెరవెనుకే ఉండిపోయింది. ధనుష్ తాజా చిత్రం 'అసురన్' అమోఘ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా'ను విడుదల చేసేందుకు గౌతమ్మేనన్, నిర్మాతలు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆ ప్రకారం నవంబర్ నెలాఖరున ఈ చిత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఈసారైనా మిస్సవకుండా ఈ చిత్రం థియేటర్లలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







