ఆ ఫ్లైట్ టాయిలెట్ లో 5.6 కిలోల బంగారం... విలువ రూ. 2. 24 కోట్లు
- November 06, 2019
దేశ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లలో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా, అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం అక్రమ రవాణాకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మాత్రమే కాదు , ఢిల్లీ, చెన్నై ఇలా ఎక్కడ చూసినా బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. కిలోల కొద్దీ బంగారం ఎయిర్ పోర్ట్ లలో పట్టుబడుతుంది. ఇక చాలా విమానాల్లో సైతం బంగారం పట్టుబడుతున్న ఘటనలు లేకపోలేదు .
తాజాగా దుబాయ్ లో బయలుదేరిన ఓ విమానంలో బంగారం స్మగ్లింగ్ కు పాల్పడ్డారు ఆగంతకులు . అయితే అధికారులకు ఈ సమాచారం అందిన అనుమానంతో వారు ఆ బంగారాన్ని చెన్నైలో ల్యాండ్ అయిన ఓ విమానం టాయిలెట్ లో పెట్టి వెళ్ళిపోయారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలలో 5.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
దుబాయ్ నుండి చెన్నై కి బయలుదేరిన విమానంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు తమకు ఫిర్యాదు అందిందని, ప్రయాణికులు ఎవరి వద్దా బంగారం లభించక పోవడంతో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్టు తెలిపారు. ఇక తనిఖీలలో మరుగుదొడ్డిలో దాచిన బంగారం బయటపడింది . టేపుతో చుట్టి ఉంచిన నాలుగు బండిల్స్ లో 5.6 కిలోల బంగారాన్ని కనుగొన్నారు కస్టమ్స్ అధికారులు .ఇక ఆ బంగారాన్ని సీజ్ చేశారు.
48 బంగారం కడ్డీలు ఆ బండిల్స్ లో ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ. 2.24 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ఇంతకీ ఈ బంగారాన్ని టాయిలెట్ లో పెట్టి వెళ్ళిన వారు ఎవరు అన్న దానిపై ఎయిర్ పోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రోజుకొక మార్గంలో ఎవరికి అనుమానం రాకుండా, స్మగ్లర్లు బంగారం అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్నారు. అడ్డుకట్ట వెయ్యటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కంట్రోల్ చెయ్యటం దేశ వ్యాప్తంగా కష్టంగా మారింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







