ఛార్థామ్ యాత్ర సీజన్ ముగిసింది
- November 18, 2019డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): చలికాలం సందర్భంగా హిమాలయాల్లో మంచు అధికంగా కురుస్తుండటంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్లో ఉన్న ఛార్థామ్ దేవాలయాన్ని ఆదివారం సాయంత్రం మూసివేశారు. బద్రీనాథ్ దేవాలయంలో సంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన అనంతరం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు బద్రీనాథ్ -కేదార్నాథ్ మందిర సమితి ప్రకటించింది. ప్రతి ఏటా అక్టోబరు- నవంబరు నెలల్లో భారీగా మంచుకురుస్తుండటంతో హిమాలయాల్లోని బద్రీనాథ్ దేవాలయాన్ని మూసివేస్తుంటారు. వేసవికాలం సమీపించాక ఏప్రిల్-మే నెల్లో మళ్లీ బద్రీనాథ్ ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. ఇప్పటికే హిమాలయాల్లో మంచు విస్తారంగా కురుస్తుండటంతో కేదార్నాథ్, గంగోత్రీ, యమునోత్రి దేవాలయాలను ఇప్పటికే మూసివేశారు. బద్రీనాథ్ ఆలయాల మూసివేతతో ఛార్థామ్ యాత్ర సీజన్ ముగిసింది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!