అమితాబ్కు నోటీసులు పంపిన తెలుగు దర్శకుడు
- November 19, 2019
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ అప్ కమింగ్ మూవీ 'జుంద్' కాపీ రైట్ చిక్కుల్లో పడింది. హైదరాబాద్కు చెందిన షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్ నంది చిన్నికుమార్ ఆ చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. గత అక్టోబర్ మొదటి వారంలో అమితాబ్తో పాటు దర్శకుడు నాగరాజ్ మంజులే, నిర్మాత కృష్ణ కుమార్, భూషణ్ కుమార్, 'స్లమ్ సాకర్' ఎన్జీవో స్థాపకులు అఖిలేశ్ పౌల్, విజయ్ బర్సేలకు నోటీసులు పంపిచారు.
స్లమ్ సాకర్ ఉద్యమానికి ఊపిరి పోసిన నాగ్పూర్కు చెందిన రిటైర్డ్ స్పోర్ట్స్ టీచర్ విజయ్ బర్సే, 'హోమ్లెస్ వరల్డ్ కప్'లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన అఖిలేశ్ పౌల్ జీవిత కథ ఆధారంగా 'జుంద్' సినిమా తీస్తున్నారు. ఇందులో విజయ్ బర్సే పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. అయితే ఈ కథనే తాను 'స్లమ్ సాకర్' అనే పేరుతో సినిమాగా తీద్దామనుకున్నానని నోటీసుల్లో చిన్ని కుమార్ పేర్కొన్నారు. 2017లో పౌల్ నుంచి అనుమతి కూడా తీసుకున్నానని, 'లైఫ్ స్టోరీ రైట్స్ అగ్రీమెంట్'పై సంతకం కూడా చేశారని చిన్ని కుమార్ చెప్పారు. ఏ భాషలోనైనా సినిమా తీసేందుకు సర్వహక్కులు తనకు ఇచ్చారని తెలిపారు. జుంద్ ప్రొడ్యూసర్కు తాను ఎన్నిసార్లు మెయిల్స్ పంపినా సమాధానం రాలేదని, పైపెచ్చు తనను బెదిరింపులకు గురి చేశారని నోటీసుల్లో చిన్ని కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









