అమితాబ్కు నోటీసులు పంపిన తెలుగు దర్శకుడు
- November 19, 2019బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ అప్ కమింగ్ మూవీ 'జుంద్' కాపీ రైట్ చిక్కుల్లో పడింది. హైదరాబాద్కు చెందిన షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్ నంది చిన్నికుమార్ ఆ చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. గత అక్టోబర్ మొదటి వారంలో అమితాబ్తో పాటు దర్శకుడు నాగరాజ్ మంజులే, నిర్మాత కృష్ణ కుమార్, భూషణ్ కుమార్, 'స్లమ్ సాకర్' ఎన్జీవో స్థాపకులు అఖిలేశ్ పౌల్, విజయ్ బర్సేలకు నోటీసులు పంపిచారు.
స్లమ్ సాకర్ ఉద్యమానికి ఊపిరి పోసిన నాగ్పూర్కు చెందిన రిటైర్డ్ స్పోర్ట్స్ టీచర్ విజయ్ బర్సే, 'హోమ్లెస్ వరల్డ్ కప్'లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన అఖిలేశ్ పౌల్ జీవిత కథ ఆధారంగా 'జుంద్' సినిమా తీస్తున్నారు. ఇందులో విజయ్ బర్సే పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. అయితే ఈ కథనే తాను 'స్లమ్ సాకర్' అనే పేరుతో సినిమాగా తీద్దామనుకున్నానని నోటీసుల్లో చిన్ని కుమార్ పేర్కొన్నారు. 2017లో పౌల్ నుంచి అనుమతి కూడా తీసుకున్నానని, 'లైఫ్ స్టోరీ రైట్స్ అగ్రీమెంట్'పై సంతకం కూడా చేశారని చిన్ని కుమార్ చెప్పారు. ఏ భాషలోనైనా సినిమా తీసేందుకు సర్వహక్కులు తనకు ఇచ్చారని తెలిపారు. జుంద్ ప్రొడ్యూసర్కు తాను ఎన్నిసార్లు మెయిల్స్ పంపినా సమాధానం రాలేదని, పైపెచ్చు తనను బెదిరింపులకు గురి చేశారని నోటీసుల్లో చిన్ని కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన