అమితాబ్కు నోటీసులు పంపిన తెలుగు దర్శకుడు
- November 19, 2019
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ అప్ కమింగ్ మూవీ 'జుంద్' కాపీ రైట్ చిక్కుల్లో పడింది. హైదరాబాద్కు చెందిన షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్ నంది చిన్నికుమార్ ఆ చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. గత అక్టోబర్ మొదటి వారంలో అమితాబ్తో పాటు దర్శకుడు నాగరాజ్ మంజులే, నిర్మాత కృష్ణ కుమార్, భూషణ్ కుమార్, 'స్లమ్ సాకర్' ఎన్జీవో స్థాపకులు అఖిలేశ్ పౌల్, విజయ్ బర్సేలకు నోటీసులు పంపిచారు.
స్లమ్ సాకర్ ఉద్యమానికి ఊపిరి పోసిన నాగ్పూర్కు చెందిన రిటైర్డ్ స్పోర్ట్స్ టీచర్ విజయ్ బర్సే, 'హోమ్లెస్ వరల్డ్ కప్'లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన అఖిలేశ్ పౌల్ జీవిత కథ ఆధారంగా 'జుంద్' సినిమా తీస్తున్నారు. ఇందులో విజయ్ బర్సే పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. అయితే ఈ కథనే తాను 'స్లమ్ సాకర్' అనే పేరుతో సినిమాగా తీద్దామనుకున్నానని నోటీసుల్లో చిన్ని కుమార్ పేర్కొన్నారు. 2017లో పౌల్ నుంచి అనుమతి కూడా తీసుకున్నానని, 'లైఫ్ స్టోరీ రైట్స్ అగ్రీమెంట్'పై సంతకం కూడా చేశారని చిన్ని కుమార్ చెప్పారు. ఏ భాషలోనైనా సినిమా తీసేందుకు సర్వహక్కులు తనకు ఇచ్చారని తెలిపారు. జుంద్ ప్రొడ్యూసర్కు తాను ఎన్నిసార్లు మెయిల్స్ పంపినా సమాధానం రాలేదని, పైపెచ్చు తనను బెదిరింపులకు గురి చేశారని నోటీసుల్లో చిన్ని కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







