ఎయిర్ అంబులెన్స్లో లండన్ కు నవాజ్ షరీఫ్
- November 19, 2019
హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. ఇవాళ ఎయిర్ అంబులెన్స్లో లండన్ వెళ్తున్నారు. పర్సనల్ డాక్టర్ అద్నన్ ఆయనతో కలిసి వెళ్లనున్నారు. వైద్య చికిత్స నిమిత్తం నవాజ్ షరీఫ్ను లండన్కు తరలిస్తున్నారు. లండన్లో డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాత.. షరీఫ్ను అమెరికా తీసుకువెళ్లాలా లేదా అన్న అంశాన్ని ఆలోచిస్తామని షెబాజ్ షరీఫ్ తెలిపారు. నవాజ్, షెబాజ్ దేశం విడిచి వెళ్తున్న నేపథ్యంలో.. పీఎంఎల్-ఎన్ పార్టీ వ్యవహారాలను సీనియర్లు చూసుకోనున్నారు. లాహోర్లోని హజ్ టర్మినల్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ విమానంలో షరీఫ్ను తీసుకువెళ్లనున్నారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు షరీఫ్కు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ ఆర్డర్ కాపీని ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అక్రమాస్తుల కేసులో షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







