'పండగ' సినిమా షూటింగ్ పూర్తి
- November 30, 2019
మారుతి దర్శకత్వంలో సాయి తేజ్-రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రతిరోజు పండగే'. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాత-మనవళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తి కానుంది.
ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. నేటితో ఆ పాట షూటింగ్ పూర్తికానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. 'ఈరోజు చిత్రంలోని చివరి పాటను రూపొందిస్తున్నాం. దీంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ 20న మీ ముందుకొస్తున్నాం. అనుకున్న సమయానికి, అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించగలిగాం. ప్రతిరోజూ పండగే కుటుంబ కథా చిత్రం. వినోదాత్మకంగా సాగుతూనే అంతర్లీనంగా సందేశం ఉంటుంది' అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







