'పండగ' సినిమా షూటింగ్ పూర్తి
- November 30, 2019మారుతి దర్శకత్వంలో సాయి తేజ్-రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రతిరోజు పండగే'. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాత-మనవళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తి కానుంది.
ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. నేటితో ఆ పాట షూటింగ్ పూర్తికానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. 'ఈరోజు చిత్రంలోని చివరి పాటను రూపొందిస్తున్నాం. దీంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ 20న మీ ముందుకొస్తున్నాం. అనుకున్న సమయానికి, అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించగలిగాం. ప్రతిరోజూ పండగే కుటుంబ కథా చిత్రం. వినోదాత్మకంగా సాగుతూనే అంతర్లీనంగా సందేశం ఉంటుంది' అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?