సౌదీ అరేబియా లో మరో కొత్త పథకం...
- December 06, 2019
సౌదీ అరేబియా: గత కొంతకాలంగా సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ వరుసగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సౌదీ పౌరసత్వ పథకాన్ని ప్రకటించారు. నిపుణులైన ప్రవాసులే టార్గెట్గా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వివిధ రంగాల్లో నిపుణులైన ప్రవాసులకు ఆ దేశ పౌరసత్వం ఇవ్వనున్నట్లు తాజాగా సౌదీ ప్రకటించింది. మెడిసిన్, సాంకేతికత, సాంస్కృతిక, క్రీడా రంగాలతో సహా వివిధ నేపథ్యాలు కలిగిన నిపుణులకు సౌదీ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించింది. విజన్ 2030లో భాగంగా సౌదీ తన ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆకర్షించడం కోసం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సౌదీ పౌరసత్వ పథకంపై ట్వీట్ చేసింది. ఈ నిర్ణయం ప్రపంచం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు, మేధావులు, ఆవిష్కర్తలను ఆకర్షించడమే తమ లక్ష్యమని పేర్కొంది.
తాజా వార్తలు
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..







