సౌదీ అరేబియా లో మరో కొత్త పథకం...
- December 06, 2019
సౌదీ అరేబియా: గత కొంతకాలంగా సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ వరుసగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సౌదీ పౌరసత్వ పథకాన్ని ప్రకటించారు. నిపుణులైన ప్రవాసులే టార్గెట్గా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వివిధ రంగాల్లో నిపుణులైన ప్రవాసులకు ఆ దేశ పౌరసత్వం ఇవ్వనున్నట్లు తాజాగా సౌదీ ప్రకటించింది. మెడిసిన్, సాంకేతికత, సాంస్కృతిక, క్రీడా రంగాలతో సహా వివిధ నేపథ్యాలు కలిగిన నిపుణులకు సౌదీ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించింది. విజన్ 2030లో భాగంగా సౌదీ తన ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆకర్షించడం కోసం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సౌదీ పౌరసత్వ పథకంపై ట్వీట్ చేసింది. ఈ నిర్ణయం ప్రపంచం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు, మేధావులు, ఆవిష్కర్తలను ఆకర్షించడమే తమ లక్ష్యమని పేర్కొంది.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









