సౌదీ అరేబియా లో మరో కొత్త పథకం...
- December 06, 2019సౌదీ అరేబియా: గత కొంతకాలంగా సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ వరుసగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సౌదీ పౌరసత్వ పథకాన్ని ప్రకటించారు. నిపుణులైన ప్రవాసులే టార్గెట్గా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వివిధ రంగాల్లో నిపుణులైన ప్రవాసులకు ఆ దేశ పౌరసత్వం ఇవ్వనున్నట్లు తాజాగా సౌదీ ప్రకటించింది. మెడిసిన్, సాంకేతికత, సాంస్కృతిక, క్రీడా రంగాలతో సహా వివిధ నేపథ్యాలు కలిగిన నిపుణులకు సౌదీ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించింది. విజన్ 2030లో భాగంగా సౌదీ తన ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆకర్షించడం కోసం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సౌదీ పౌరసత్వ పథకంపై ట్వీట్ చేసింది. ఈ నిర్ణయం ప్రపంచం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు, మేధావులు, ఆవిష్కర్తలను ఆకర్షించడమే తమ లక్ష్యమని పేర్కొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ