అగ్ని ప్రమాదాల నివారణకు కొత్త నిబంధనలు
- January 14, 2016
దేశంలోని అన్ని భవనాల్నీ రివ్యూ చేయాలని యూఏఈ నిర్ణయించింది. ఇటీవల వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ మరియు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్తో కలిపి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఓ సర్వే నిర్వహించనుంది. ఆ సర్వేలో వెలుగు చూసే అంశాల్ని బట్టి, కొన్ని నిబంధనల్ని అమల్లోకి తీసుకురానున్నారు. మార్చ్లో భవనాల రక్షణకు సంబంధించి 'కొత్త ఫైర్ సేఫ్టీ కోడ్'ని తీసుకురాబోతున్నారు. ఆ కోడ్ ప్రకారం, ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగితే, దానికి పూర్తిగా ఆ భవన యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదం కారణంగా జరిగే నష్టానికీ అతనే బాధ్యుడవుతాడు. ఓ భవనం తాలూకు నిర్వహణ విషయాన్ని సదరు భవన యజమాని చూసుకోవాలి. డెవలపర్ కాకుండా, థర్డ్ పార్టీ సంస్థ ద్వారా భవన నిర్మాణంలో భద్రతా ఏర్పాట్లనూ ఆ భవన యజమాని పర్యవక్షించాలి. అగ్ని ప్రమాదాలకు సంబంధించి గతంలో జరిగిన ఘటనల్ని పరిగణనలోకి తీసుకుంటామనీ, కొత్త కోడ్ ద్వారా దేశంలో అగ్ని ప్రమాదాల్ని పూర్తిగా నివారించేలా చర్యలు తీసుకుంటామని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







