భారత వలసదారులకి పాస్‌పోర్ట్‌ ఇబ్బందులు

- January 14, 2016 , by Maagulf
భారత వలసదారులకి పాస్‌పోర్ట్‌ ఇబ్బందులు

వింటర్‌ బ్రేక్‌లో భాగంగా స్వదేశానికి వెళ్ళాలనుకుంటున్న భారతదేశానికి చెందిన యూఏఈలోని వలసదారులకు పాస్‌పోర్ట్‌ ఇబ్బందులు తప్పడంలేదు. పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ కోసం 2015, సెప్టెంబర్‌ 5న దరఖాస్తు చేసుకున్నా, అది ఇప్పటిదాకా జరగలేదని అబ్దుల్‌ గఫూర్‌ ఇస్మాయిల్‌ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే యూఏఈలోని భారత రాయబారి మాత్రం ఆ ఆరోపణల్ని కొట్టి పారేశారు. పాస్‌పోర్టుల జారీలో ఎలాంటి ఆలస్యం జరగడంలేదని విమవరించారు. అయితే మలేసియా వెళ్ళాలనుకున్న తనకు తన భార్య పాస్‌పోర్ట్‌ ప్రాసెస్‌ కాకపోవడంతో వెళ్ళడం కుదరలేదని చెప్పారు. ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో తత్కాల్‌ పాస్‌పోర్టులకూ సమస్యలు తప్పడంలేదు. తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యల్నీ పరిష్కరిస్తున్నామనీ, కొన్ని సాంకేతిక కారణాలు, క్లియరెన్స్‌ ఇబ్బందుల వల్ల చాలా తక్కువ సందర్భాల్లోనే పాస్‌పోర్టుల జారీలో సమస్యలు వస్తున్నాయని అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com