అండర్ 19 టోర్నమెంటులో భారత జట్టుకు ప్రాతినిధ్యం ..
- January 14, 2016
అంతర్జాతీయ స్థాయిలో అండర్ 19 టోర్నమెంటులో భాగస్వామి కావాలన్నది ప్రతి యువ క్రికెటర్ కల అనడంలో సందేహం లేదు. అయితే 19 ఏళ్ల లోపుగానే ఆ ఆవకాశం రెండో సారి దక్కడం అంటే మాటలు కాదు. అలా అండర్ 19 వరల్డ్ కప్ లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి రెండు సార్లు ఎంపికైన ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా 18 మంది ఉంటే వారిలో భారత్ కు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. ఈ నెల 27 నుంచి బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్ కు ఎంపికైన భారత జట్టు సభ్యులలో ముగ్గురు భారత జట్టు తరఫున వరల్డ్ కప్ కు రెండో సారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారు సర్ఫరాజ్ ఖాన్, రికి భుహి, అవేష్ ఖాన్ లు వీరు ముగ్గరూ కూడా యూఏఈలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీకి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.అలాగే ఆతిధ్య బంగ్లాదేశ్ జట్టులో మెహిది హస్సన్ మీర్జా కూడా రెండో సారి అండర్19 వరల్డ్ కప్ ఆడుతున్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







