అండర్ 19 టోర్నమెంటులో భారత జట్టుకు ప్రాతినిధ్యం ..
- January 14, 2016
అంతర్జాతీయ స్థాయిలో అండర్ 19 టోర్నమెంటులో భాగస్వామి కావాలన్నది ప్రతి యువ క్రికెటర్ కల అనడంలో సందేహం లేదు. అయితే 19 ఏళ్ల లోపుగానే ఆ ఆవకాశం రెండో సారి దక్కడం అంటే మాటలు కాదు. అలా అండర్ 19 వరల్డ్ కప్ లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి రెండు సార్లు ఎంపికైన ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా 18 మంది ఉంటే వారిలో భారత్ కు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. ఈ నెల 27 నుంచి బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్ కు ఎంపికైన భారత జట్టు సభ్యులలో ముగ్గురు భారత జట్టు తరఫున వరల్డ్ కప్ కు రెండో సారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారు సర్ఫరాజ్ ఖాన్, రికి భుహి, అవేష్ ఖాన్ లు వీరు ముగ్గరూ కూడా యూఏఈలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీకి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.అలాగే ఆతిధ్య బంగ్లాదేశ్ జట్టులో మెహిది హస్సన్ మీర్జా కూడా రెండో సారి అండర్19 వరల్డ్ కప్ ఆడుతున్నాడు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









