ప్రవాసి మిత్ర గొల్లపల్లి మండల కార్యవర్గం నియామకం
- December 24, 2019
తెలంగాణ:ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ గొల్లపల్లి మండల కన్వీనర్ గా మ్యాడవరపు నాగభూషణం, మండల వలంటీర్ గా సయిండ్ల దామోదర్ ను నియమిస్తూ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల మంగళవారం జగిత్యాలలో నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి పాల్గొన్నారు.
వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల వీరికి ఉన్న నిబద్దత, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ లో క్రియాశీలకంగా పని చేయాలనే ఆసక్తి, నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ నియామకాలు చేపట్టినట్లు స్వదేశ్ తెలిపారు.
ప్రజలు బ్రతుకుదెరువు కోసం, ఉద్యోగం, ఉపాధి కోసం అంతర్గత వలసలు, అంతర్జాతీయ వలసలు వెళుతుంటారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసల కోసం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఈ సందర్బంగా స్వదేశ్ అన్నారు
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









