రికార్డింగ్ స్టూడియోతో షార్జాలో జైల్ ప్రారంభం
- January 16, 2016
కొత్త సెంట్రల్ జైల్ బిల్డింగ్ తొలి ఫేజ్ పూర్తయ్యింది. ఈ జైల్ నిర్మాణం కోసం 400 మిలియన్ దిర్హామ్లను వెచ్చిస్తున్నారు. అల్ రమాతా ఏరియాలో దీన్ని నిర్మిస్తున్నారు. 4000 మంది ఖైదీల కోసం అనువుగా నిర్మిస్తున్న ఈ కొత్త జైల్లో అనేక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ నిర్మాణంతో వెయ్యి మందికి అకామడేట్ చెయ్యడానికి వీలవుతుంది. రెండు ఫేజుల్లో ఈ జైల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, వారికి జైల్లో సకల సౌకర్యాలూ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పెంటరీ, సీవింగ్ వంటి పనులు చేసే ఖైదీలకు 100 డాలర్లు వేతనం ఇవ్వనున్నారు. ఖురాన్ పఠనం వంటివి కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఖురాన్ పఠనంలో ప్రతిభ చూపించినవారికి ప్రత్సాహకాలు కూడా అందిస్తారు. అంతే కాకుండా, శిక్ష అనుభవిస్తూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న ఖైదీలు, వారి కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







