ఢిల్లీ విజ్ఞాన్భవన్లో అంకురభారత్ ప్రారంభించిన ప్రధాని
- January 16, 2016
ఢిల్లీ విజ్ఞాన్భవన్లో అంకురభారత్ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం. యువ వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడంపై మార్గసూచి విడుదల చేశారు. వినూత్న ఆలోచనలతో సంస్థలు ఏర్పాటు చేసే వారికి ప్రోత్సాహం, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడమే అంకుర భారత్ లక్ష్యం. స్వయం ఉపాధి, స్వావలంభన ప్రోత్సహం దిశగా కేంద్రం అడుగు వేసింది. 35లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చేలా పథకం రూపకల్పన చేశారు. అంకుర్ భారత్ గురించి ఆగస్టు 15న ప్రకటన చేశానని ప్రధాని మోడీ తెలిపారు. స్టార్టప్లకు పన్నుల రాయితీలు, మూలధన లాభపన్నులో రాయితీ, మరెన్నో సౌకర్యాలు కల్పించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







