ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో అంకురభారత్ ప్రారంభించిన ప్రధాని

- January 16, 2016 , by Maagulf
ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో అంకురభారత్ ప్రారంభించిన ప్రధాని

ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో అంకురభారత్ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం. యువ వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడంపై మార్గసూచి విడుదల చేశారు. వినూత్న ఆలోచనలతో సంస్థలు ఏర్పాటు చేసే వారికి ప్రోత్సాహం, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడమే అంకుర భారత్ లక్ష్యం. స్వయం ఉపాధి, స్వావలంభన ప్రోత్సహం దిశగా కేంద్రం అడుగు వేసింది. 35లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చేలా పథకం రూపకల్పన చేశారు. అంకుర్ భారత్ గురించి ఆగస్టు 15న ప్రకటన చేశానని ప్రధాని మోడీ తెలిపారు. స్టార్టప్‌లకు పన్నుల రాయితీలు, మూలధన లాభపన్నులో రాయితీ, మరెన్నో సౌకర్యాలు కల్పించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com