దుబాయ్ నుంచి జైపూర్, హైద్రాబాద్కి స్పైస్జెట్ విమానాలు
- January 17, 2016
భారతదేశానికి చెందిన బడ్జెట్ ఎయిర్లైన్స్ స్పైస్జెట్, దుబాయ్ నుంచి హైద్రాబాద్, జైపూర్కి రెండు కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. దీంతో మొత్తం భారతదేశంలోని పది ప్రాంతాలకు స్పైస్జెట్ దుబాయ్ నుంచి ప్రతిరోజూ విమానాల్ని నడుపుతున్నట్లవుతుంది. కొత్త సర్వీసుల ప్రారంభం సందర్భంగా స్పైస్జెట్ ప్రయాణీకులకు ఆఫర్లనూ ప్రకటించింది.359 దిర్హామ్లతో దుబాయ్ నుంచి జైపూర్కీ, 397 దిర్హామహలతో దుబాయ్ నుంచి హైద్రాబాద్కీ ఒక మార్గంలో ప్రయాణించడానికి వీలు కల్పిస్తూ ఈ ఆఫర్ని స్పైస్జెట్ ప్రకటించింది. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయనీ, ఫిబ్రవరి 16 నుంచి విమానాలు ప్రారంభమవుతాయని స్పైస్జెట్ అధికారులు వెల్లడించారు. జైపూర్ - దుబాయ్ సెక్టార్లో తొలి ప్రైవేటు విమానయాన సంస్థగా స్పైస్జెట్ అవతరించింది. బోయింగ్ 737 800 విమానాల్ని సంస్థ వినియోగిస్తుంది. స్పేస్జెట్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా, ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్స్, ట్రావెల్ ఎజెంట్స్ ద్వారా ప్రయాణీకులు టిక్కెట్లు పొందవచ్చు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







