దుబాయ్ నుంచి జైపూర్, హైద్రాబాద్కి స్పైస్జెట్ విమానాలు
- January 17, 2016
భారతదేశానికి చెందిన బడ్జెట్ ఎయిర్లైన్స్ స్పైస్జెట్, దుబాయ్ నుంచి హైద్రాబాద్, జైపూర్కి రెండు కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. దీంతో మొత్తం భారతదేశంలోని పది ప్రాంతాలకు స్పైస్జెట్ దుబాయ్ నుంచి ప్రతిరోజూ విమానాల్ని నడుపుతున్నట్లవుతుంది. కొత్త సర్వీసుల ప్రారంభం సందర్భంగా స్పైస్జెట్ ప్రయాణీకులకు ఆఫర్లనూ ప్రకటించింది.359 దిర్హామ్లతో దుబాయ్ నుంచి జైపూర్కీ, 397 దిర్హామహలతో దుబాయ్ నుంచి హైద్రాబాద్కీ ఒక మార్గంలో ప్రయాణించడానికి వీలు కల్పిస్తూ ఈ ఆఫర్ని స్పైస్జెట్ ప్రకటించింది. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయనీ, ఫిబ్రవరి 16 నుంచి విమానాలు ప్రారంభమవుతాయని స్పైస్జెట్ అధికారులు వెల్లడించారు. జైపూర్ - దుబాయ్ సెక్టార్లో తొలి ప్రైవేటు విమానయాన సంస్థగా స్పైస్జెట్ అవతరించింది. బోయింగ్ 737 800 విమానాల్ని సంస్థ వినియోగిస్తుంది. స్పేస్జెట్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా, ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్స్, ట్రావెల్ ఎజెంట్స్ ద్వారా ప్రయాణీకులు టిక్కెట్లు పొందవచ్చు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









