అంగరంగ వైభవంగా నంది నాటకోత్సవాలు...

- January 18, 2016 , by Maagulf
అంగరంగ వైభవంగా నంది నాటకోత్సవాలు...

నంది నాటకోత్సవాలు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. మహతి కళాక్షేత్రం వేదికగా పదిరోజుల పాటు ఈ నాటకోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు శివప్రసాద్‌, మురళీమోహన్‌, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, రోజా తదితరులు హాజరయ్యారు. పలు జిల్లాల నుంచి సుమారు 2వేల మంది కళాకారులు ఈ నాటకోత్సవంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com