నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది..

- January 21, 2016 , by Maagulf
నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది..

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ఉపసంహరణకు ఈసీ ఇచ్చిన గడువు ముగిసినట్లయింది. నామినేషన్లలో అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పలేదు. ఉపసంహరణ గడువు ముగిసేసరికి 150 డివిజన్లలో 1939 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా పార్టీల అగ్రనేతల బుజ్జగింపులతో చివరిరోజు 454 మంది తిరుగుబాటు నేతలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు రాత్రి ప్రకటించనున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న భాజపా-తెదేపాలకు రెబల్స్‌ బెడద తప్పలేదు. పొత్తులో భాగంగా తెదేపా పార్టీకి కేటాయించిన డివిజన్లలో మూడింటిలో భాజపా తమ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది. తెదేపా కూడా భాజపాకు కేటాయించిన స్థానాల్లో ఐదింటిలో తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com