నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది..
- January 21, 2016
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ఉపసంహరణకు ఈసీ ఇచ్చిన గడువు ముగిసినట్లయింది. నామినేషన్లలో అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పలేదు. ఉపసంహరణ గడువు ముగిసేసరికి 150 డివిజన్లలో 1939 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా పార్టీల అగ్రనేతల బుజ్జగింపులతో చివరిరోజు 454 మంది తిరుగుబాటు నేతలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు రాత్రి ప్రకటించనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న భాజపా-తెదేపాలకు రెబల్స్ బెడద తప్పలేదు. పొత్తులో భాగంగా తెదేపా పార్టీకి కేటాయించిన డివిజన్లలో మూడింటిలో భాజపా తమ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది. తెదేపా కూడా భాజపాకు కేటాయించిన స్థానాల్లో ఐదింటిలో తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









