నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది..
- January 21, 2016
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ఉపసంహరణకు ఈసీ ఇచ్చిన గడువు ముగిసినట్లయింది. నామినేషన్లలో అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పలేదు. ఉపసంహరణ గడువు ముగిసేసరికి 150 డివిజన్లలో 1939 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా పార్టీల అగ్రనేతల బుజ్జగింపులతో చివరిరోజు 454 మంది తిరుగుబాటు నేతలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు రాత్రి ప్రకటించనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న భాజపా-తెదేపాలకు రెబల్స్ బెడద తప్పలేదు. పొత్తులో భాగంగా తెదేపా పార్టీకి కేటాయించిన డివిజన్లలో మూడింటిలో భాజపా తమ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది. తెదేపా కూడా భాజపాకు కేటాయించిన స్థానాల్లో ఐదింటిలో తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







