రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఆమ్నెస్టీ లేదు
- February 20, 2020
కువైట్:ఈ ఏడాది ఆమ్నెస్టీ, రెసిడెన్సీ ఉల్లంఘనులకు లేదని తెలుస్తోంది. ఉల్లంఘనుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారనీ, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కువైట్ లేదా ఇతర గల్ఫ్ దేశాలకు ఐదేళ్ళదాకా తిరిగి రానిచ్చే అవకాశం లేదని సమాచారం. ఓ రిపోస్ట్ ప్రకారం, స్పాన్సర్స్ ద్వారా ఉద్యోగాలు పొందినవారు, ఆ తర్వాత స్పాన్సర్ని కాదని, వేరే వారి వద్ద పని కుదుర్చుకుని, అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారనీ, ఈ సంఖ్య ఇటీవలికాలంలో గణనీయంగా పెరిగిపోయిందనీ, క్షమాభిక్ష ద్వారా ఇలాంటివారు తగిన జరీమానాలు చెల్లించకుండా సొంత దేశాలకు వెళ్ళిపోతున్నారనీ తెలుస్తోంది. ఈ కొత్త విధానానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







