కువైట్లో పూటుగా మద్యం తాగిన భారత వ్యక్తి...
- March 01, 2020
కువైట్: గుర్తు తెలియని ఓ భారత వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి ఆగి ఉన్న కారు వెనక వైపు నేలపై పడుకొని ఉండడంతో కువైట్లోని హవల్లి పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఆగి ఉన్న కారు వెనక వైపు నేలపై కునుకు తీయడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఆ వ్యక్తిని దూరం నుంచి చూసిన స్థానికులు అతనికి కరోనా వైరస్ సోకిందేమోనని దగ్గరికి కూడా వెళ్లలేదు. మరికొందరైతే అతను గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని దూరం నుంచే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన పారామెడిక్స్, పోలీస్ సిబ్బంది అతని దగ్గరికి వెళ్లి గమనించడంతో అసలు విషయం తెలిసింది. అతను పూటుగా మద్యం తాగి పడిపోయినట్లు గుర్తించారు. దాంతో వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని హవల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







