కువైట్లో పూటుగా మద్యం తాగిన భారత వ్యక్తి...
- March 01, 2020కువైట్: గుర్తు తెలియని ఓ భారత వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి ఆగి ఉన్న కారు వెనక వైపు నేలపై పడుకొని ఉండడంతో కువైట్లోని హవల్లి పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఆగి ఉన్న కారు వెనక వైపు నేలపై కునుకు తీయడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఆ వ్యక్తిని దూరం నుంచి చూసిన స్థానికులు అతనికి కరోనా వైరస్ సోకిందేమోనని దగ్గరికి కూడా వెళ్లలేదు. మరికొందరైతే అతను గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని దూరం నుంచే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన పారామెడిక్స్, పోలీస్ సిబ్బంది అతని దగ్గరికి వెళ్లి గమనించడంతో అసలు విషయం తెలిసింది. అతను పూటుగా మద్యం తాగి పడిపోయినట్లు గుర్తించారు. దాంతో వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని హవల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!