కువైట్లో పూటుగా మద్యం తాగిన భారత వ్యక్తి...
- March 01, 2020
కువైట్: గుర్తు తెలియని ఓ భారత వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి ఆగి ఉన్న కారు వెనక వైపు నేలపై పడుకొని ఉండడంతో కువైట్లోని హవల్లి పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఆగి ఉన్న కారు వెనక వైపు నేలపై కునుకు తీయడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఆ వ్యక్తిని దూరం నుంచి చూసిన స్థానికులు అతనికి కరోనా వైరస్ సోకిందేమోనని దగ్గరికి కూడా వెళ్లలేదు. మరికొందరైతే అతను గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని దూరం నుంచే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన పారామెడిక్స్, పోలీస్ సిబ్బంది అతని దగ్గరికి వెళ్లి గమనించడంతో అసలు విషయం తెలిసింది. అతను పూటుగా మద్యం తాగి పడిపోయినట్లు గుర్తించారు. దాంతో వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని హవల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!