ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- July 09, 2026
మనామా: ఇటీవల ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిని బహ్రెయిన్ మంత్రి మండలి అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కమిటీ సమీక్షించింది. ఉప ప్రధాన మంత్రి షేక్ ఖాలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అధ్యక్షతన జరిగిన 310వ సమావేశంలో కీలక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, జాతీయ విజయాలపై చర్చించారు. ఇరాన్ దాడుల కారణంగా హిద్ద్ హౌసింగ్ సిటీ, సిత్రా ప్రాంతాల్లో దెబ్బతిన్న మరో విడత ఇళ్ల మరమ్మతులను నిర్ణీత గడువులో పూర్తి చేసినందుకు ప్రజా పనుల మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణం మరియు పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖలను కమిటీ అభినందించింది. దాడుల్లో ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్న పౌరులకు పరిహారం అందించాలని బహ్రెయిన్ రాజు, అలాగే యువరాజు మరియు ప్రధాన మంత్రి జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ పనులు చేపట్టినట్లు పేర్కొంది.
ఈ సమావేశంలో 2026 అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) విడుదల చేసిన ఐసీటీ డెవలప్మెంట్ ఇండెక్స్ లో బహ్రెయిన్ సాధించిన ప్రగతిని కూడా ప్రస్తావించారు. ప్రపంచంలోని 159 దేశాల్లో బహ్రెయిన్ ఆరో స్థానంలో నిలిచి, గత ఏడాదితో పోలిస్తే మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. మొత్తం 98 శాతం స్కోరు సాధించడం ద్వారా డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతిక అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న నిరంతర పెట్టుబడులకు ఇది నిదర్శనమని కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







