మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా..?’ ఫస్ట్ లుక్ విడుదల
- March 03, 2020
వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న హీరోయిన్ రెజీనా కసండ్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా..?’. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతుంది. న్యూ ఏజ్ ఫిలిమ్ మేకర్గా తొలి చిత్రం `నిను వీడని నీడను నేనే` సినిమాతో సూపర్హిట్ సాధించి తన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్పై నిర్మాత రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంగళవారం విడుదల చేశారు. ఇనుప చువ్వల మద్య బంధీగా ఉన్న మహారాణి పాత్రధారిగా రెజీనా కసండ్ర లుక్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా...
యాపిల్ ట్రీ స్టూడియోస్ అధినేత, నిర్మాత రాజశేఖర్ వర్మ మాట్లాడుతూ - ``మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘నేనే నా..?’ సినిమాను కార్తీక్ రాజుగారు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈరోజు వరుణ్తేజ్గారు మా సినిమాలోని రెజీనాగారి లుక్ను విడుదల చేశారు. ఆయనకు మా యూనిట్ తరపున స్పెషల్ థాంక్స్. రెజీనా లుక్కి చాలా మంచి స్పందన వచ్చింది. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోన్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాలజిస్ట్గా కనపడతారు. నటిగా ఆమెను మరో యాంగిల్లో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ఆమె స్పెషల్గా ట్రైనింగ్ తీసుకుని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు’’ అన్నారు.
ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతాన్ని.. పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







