ఉగ్రవాదంపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి--ఒబామా
- January 24, 2016
ఉగ్రవాదంపై పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. ఆయన ఆదివారం వాషింగ్టన్లో పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థలపై చర్యలను పాక్ తమ ప్రాంతం నుంచే మొదలుపెట్టాలని హితవు పలికారు. ఉగ్రవాదుల అరాచకత్వాన్ని అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాణాలకు తెగించి.. దేశం కోసం పోరాడి ప్రాణాలొదిలిన పఠాన్కోట్ సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని ఒబామా చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పఠాన్కోట్ దాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంప్రదింపులు అభినందనీయమన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు







