ఉగ్రవాదంపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి--ఒబామా
- January 24, 2016
ఉగ్రవాదంపై పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. ఆయన ఆదివారం వాషింగ్టన్లో పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థలపై చర్యలను పాక్ తమ ప్రాంతం నుంచే మొదలుపెట్టాలని హితవు పలికారు. ఉగ్రవాదుల అరాచకత్వాన్ని అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాణాలకు తెగించి.. దేశం కోసం పోరాడి ప్రాణాలొదిలిన పఠాన్కోట్ సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని ఒబామా చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పఠాన్కోట్ దాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంప్రదింపులు అభినందనీయమన్నారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







