ఉగ్రవాదంపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి--ఒబామా

- January 24, 2016 , by Maagulf
ఉగ్రవాదంపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి--ఒబామా

ఉగ్రవాదంపై పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. ఆయన ఆదివారం వాషింగ్టన్‌లో పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థలపై చర్యలను పాక్‌ తమ ప్రాంతం నుంచే మొదలుపెట్టాలని హితవు పలికారు. ఉగ్రవాదుల అరాచకత్వాన్ని అణిచివేసేందుకు పాక్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాణాలకు తెగించి.. దేశం కోసం పోరాడి ప్రాణాలొదిలిన పఠాన్‌కోట్‌ సైనికులకు సెల్యూట్‌ చేస్తున్నానని ఒబామా చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పఠాన్‌కోట్‌ దాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంప్రదింపులు అభినందనీయమన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com