కరోనా అలర్ట్:డాక్యుమెంట్ల గడువు ముగిసినా యూఏఈ మొబైల్ సర్వీస్ కొనసాగింపు

- March 28, 2020 , by Maagulf
కరోనా అలర్ట్:డాక్యుమెంట్ల గడువు ముగిసినా యూఏఈ మొబైల్ సర్వీస్ కొనసాగింపు

యూఏఈ:డాక్యుమెంట్ల గడువు ముగిసినా యూఏఈలో మొబైల్ సర్వీసులను రద్దు చేయొద్దని టెలికమ్యూనికేషన్ నియంత్రణ అధికారులు కంపెనీలను ఆదేశించారు.ఎమిరాతి గుర్తింపు పత్రం గడువు కాలం ముగిసినా..మొబైల్ సేవలకు కావాల్సిన డాక్యుమెంట్లు లేకపోయినా మొబైల్ సేవలను మాత్రం రద్దు చేయవద్దని సూచించింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో వణికిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెలికమ్యూనికేషన్ నియంత్రణ అధికారులు తెలిపారు. గుర్తింపు పత్రాల రెన్యూవల్, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించేందుకు టెలికమ్యూనికేషన్ ఆఫీసులకు వెళ్లే వినియోగదారులను నియంత్రించటం లక్ష్యంగా ఈ వెసులుబాటు కల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com