కరోనా అలర్ట్:డాక్యుమెంట్ల గడువు ముగిసినా యూఏఈ మొబైల్ సర్వీస్ కొనసాగింపు
- March 28, 2020
యూఏఈ:డాక్యుమెంట్ల గడువు ముగిసినా యూఏఈలో మొబైల్ సర్వీసులను రద్దు చేయొద్దని టెలికమ్యూనికేషన్ నియంత్రణ అధికారులు కంపెనీలను ఆదేశించారు.ఎమిరాతి గుర్తింపు పత్రం గడువు కాలం ముగిసినా..మొబైల్ సేవలకు కావాల్సిన డాక్యుమెంట్లు లేకపోయినా మొబైల్ సేవలను మాత్రం రద్దు చేయవద్దని సూచించింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో వణికిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెలికమ్యూనికేషన్ నియంత్రణ అధికారులు తెలిపారు. గుర్తింపు పత్రాల రెన్యూవల్, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించేందుకు టెలికమ్యూనికేషన్ ఆఫీసులకు వెళ్లే వినియోగదారులను నియంత్రించటం లక్ష్యంగా ఈ వెసులుబాటు కల్పించారు.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







