మనస్సాక్షి
- May 21, 2015
ఒకసారి అక్బర్ మహారాజు ఉంగరం ఎక్కడో పడిపోయింది. కోట మొత్తం వెతికించినా ఎక్కడా కనిపించలేదు. అప్పుడు బీర్బల్ ని దర్బారుకు పిలిపించి 'నా ఉంగరం కనిపించడంలేదు. సేవకులు కోటంతా వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. మన సభలోని వాళ్ళే ఎవరో దొంగాలించారని నా అనుమానం. ఎవరు దొంగాలించారో కనిపెట్టగలవా?' అని అడిగాడు. బీర్బల్ ఒక్క నిమిషంపాటు ఆలోచించి 'ఇది చాలా సులువైన పని మహారాజా, ఉంగరం దొంగిలించిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే అతడి గడ్డంలో ఒక బియ్యపుగింజ ఉంటుంది. దాన్నిబట్టి ఎవరు దొంగతనం చేశారో తేలిపోతుంది. అందరి గడ్డాలూ ఒక్కసారి పరిశీలించి అసలైన దొంగను కనిపెట్టేస్తాను' అన్నాడు. ఆ మాటలు వింటూనే సభలోని ఒక వ్యక్తి భయంభయంగా తన గడ్డం తడుముకున్నాడు. అది చూసిన బీర్బల్ వెంటనే అతడిని పట్టించాడు. 'దొంగ గడ్డంలో బియ్యపుగింజ ఉందన్న విషయం నీకెలా తెలుసు?' అంటూ అక్బర్ ఆశ్చర్యంగా అడిగాడు. 'గడ్డంలో బియ్యపుగింజ ఎలా ఉంటుంది మహారాజా, తప్పు చేసిన వ్యక్తిని మనస్సాక్షి ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. తప్పు చేయనివాళ్ళు దొంగతనం చేసింది ఎవరా అని అటూఇటూ ఆసక్తిగా చూస్తుంటే తప్పుచేసిన వ్యక్తి భయంతో గడ్డం తడుముకున్నాడు' అంటూ అసలు సంగతి వివరించాడు. అలా తన తెలివితేటలను, సమయస్ఫూర్తితో దొంగను పట్టించడమే కాకుండా రాజు గారి ప్రశంసలూ అందుకున్నాడు బీర్బల్.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







