హెల్మెట్లు వినియోగించని వారి లైసెన్సులు రద్దు!
- January 25, 2016
ఏపీలకు హైకోర్టు సూచన హైదరాబాద్, జనవరి 25 హెల్మెట్లు ధరించని వారిపై కేసులు నమోదు చేయడం కాదు... వాటిని వినియోగించేలా చర్యలు ఉండాలని హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. హెల్మెట్ల వినియోగం తెలుగు రాషా్ట్రల్లో ఎందుకు అమలు కావడం లేదని నిలదీసింది. హైకోర్టు ప్రశ్నకు ఏపీ ఏజీ పీ వేణుగోపాల్ స్పందిస్తూ... హెల్మెట్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇలాంటి చర్యలవల్ల ఉపయోగం లేదని వ్యాఖ్యానించిన హైకోర్టు... హెల్మెట్లు వినియోగించని వారి లైసెన్సులు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. కోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ స్పెషల్ జీపీ స్పందిస్తూ... హెల్మెట్లు వినియోగించని వారిపై నిరుడు సెప్టెంబరులో 18వేలు కేసులు, అక్టోబరులో 19 వేలు, నవంబరులో 22వేలు నమోదు చేశామన్నారు. 45 వేల పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని తెలంగాణ ఏజీ కోర్టుకు తెలిపారు. తెలంగాణతో పోల్చితే ఏపీ సరైన చర్యలు తీసుకుంటున్నట్లు కన్పించడంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇటీవల తాను ఆదిలాబాద్ వెళ్లినప్పుడు అక్కడ కూడా హెల్మెట్ల వినియోగం సరిగా లేదని ఏసీజే వ్యాఖ్యానించారు. హెల్మెట్లు వాడకపోవడం వల్ల 2012 నుంచి నేటి వరకు 70 మంది చనిపోయారని తెలంగాణ స్పెషల్ జీపీ వివరించగా.... మరో 70 మంది మరణిస్తేగానీ చర్యలు తీసుకోరా... హైకోర్టు వ్యాఖ్యానించింది. వాహనాల చట్టం సెక్షన్ 129ని అమలు చేయాలని కోరుతూ న్యాయవాది ఉడతనేని రామారావు 2009లో దాఖలు చేసిన 'పిల్'పై బెంచ్ మరోసారి విచారించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







