తెలంగాణాలో కరోనా విజృంభణ.. మరో 43 మందికి సోకిన వైనం

- April 04, 2020 , by Maagulf
తెలంగాణాలో కరోనా విజృంభణ.. మరో 43 మందికి సోకిన వైనం

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఈ రోజు రాష్ట్రంలో మొత్తం 43 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 272కు చేరింది. ఈ రోజు ఉదయం వరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 229కి ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటివరకు 32 మంది కరోనా నుంచి కోలుకున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ ప్రాంతాల్లోనే బాధితులు అధికంగా ఉన్నారు. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com