'దుబాయి-సంప్రదాయం' ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 'శ్రీ వేంకటేశ్వర కళ్యాణం'
- January 26, 2016
సంప్రదాయం-దుబాయి వారి సమర్పణలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర కళ్యాణం అంగ రంగ వైభవముగా జరిగింది.జనవరి 22, దుబాయి-సఫా లో కల జె.ఎస్.ఎస్ ప్రైవేటు స్కూలు నందు ఉదయము 7 గంటల నుంచి సాయంత్రము 7 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమములో 10,౦౦౦ మందికి పైగా భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదములు స్వీకరించారు. తిరుపతి నుంచి వచ్చిన వేదపండితులు ఉదయము సుప్రభాత సేవ, అభిషేకము, కళ్యాణము, డోలోత్సవము మరియు సహస్ర దీపాలంకరణ సేవలను శాస్త్రోక్తముగా నిర్వహించారు. అన్న ప్రసాదములతో సహా తిరుమలని తలపించిన ఈ కార్యక్రమము లో అనేకమంది భక్తులు ఆనంద పారవశ్యము చెందారు. తిరుమల దుబాయి కి తరలి వచ్చిందని పలువురు భక్తులు విశేషముగా చెప్పుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన 'సంప్రదాయం' టీం సభ్యులకు మాగల్ఫ్.కామ్ టీం తరుపున ప్రత్యేక అభినంధనులు.





తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







