'దుబాయి-సంప్రదాయం' ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 'శ్రీ వేంకటేశ్వర కళ్యాణం'

- January 26, 2016 , by Maagulf

సంప్రదాయం-దుబాయి వారి సమర్పణలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర కళ్యాణం అంగ రంగ వైభవముగా జరిగింది.జనవరి 22, దుబాయి-సఫా లో కల జె.ఎస్.ఎస్ ప్రైవేటు స్కూలు నందు ఉదయము 7 గంటల నుంచి సాయంత్రము 7 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమములో 10,౦౦౦ మందికి పైగా భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదములు స్వీకరించారు. తిరుపతి నుంచి వచ్చిన వేదపండితులు ఉదయము సుప్రభాత సేవ, అభిషేకము, కళ్యాణము, డోలోత్సవము మరియు సహస్ర దీపాలంకరణ సేవలను శాస్త్రోక్తముగా నిర్వహించారు. అన్న ప్రసాదములతో సహా తిరుమలని తలపించిన ఈ కార్యక్రమము లో అనేకమంది భక్తులు ఆనంద పారవశ్యము చెందారు. తిరుమల దుబాయి కి తరలి వచ్చిందని పలువురు భక్తులు విశేషముగా చెప్పుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన 'సంప్రదాయం' టీం సభ్యులకు మాగల్ఫ్.కామ్ టీం తరుపున  ప్రత్యేక అభినంధనులు.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com