ట్రంప్ ట్వీట్..స్పందించిన మోడీ...
- April 09, 2020
హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ పంపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్కు స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ... కఠిన సమయాల్లో మిత్రులు మరింత దగ్గరవుతారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే భారత్-అమెరికా బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు. కోవిడ్ 19పై పోరాటంలో మానవత్తం చాటేందుకు భారత్ ముందు ఉంటుందన్నారు. మనమంతా కలిసి కరోనా ఎదుర్కోందాం అంటూ.. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ను రీట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కాగా, హైడ్రాక్సీక్లోరోక్విన్ను అమెరికాకు ఎగుమతి చేసేందుకు భారత్ ముందుకు రావడంతో ట్వీట్లతో మోడీని కొనియాడిన ట్రంప్.. మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సన్నిహత సంబంధాలు అవసరమన్నారు. అమెరికాకు మందులు సరఫరా చేస్తున్నందుకు భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్.. ఈ మేలును ఎప్పటికీ మరిచిపోమన్నారు. పనిలో పనిగా ప్రధాని మోడీని పొగడ్తల్లో ముంచెత్తారు డొనాల్డ్ ట్రంప్.. భారత్కు సమర్థ నాయకత్వాన్ని అందించడమే కాకుండా మానవత్వాన్ని చూటుకుంటున్నారని కొనియాడిన విషయం తెలిసిందే.
Fully agree with you President @realDonaldTrump. Times like these bring friends closer. The India-US partnership is stronger than ever.
— Narendra Modi (@narendramodi) April 9, 2020
India shall do everything possible to help humanity's fight against COVID-19.
We shall win this together. https://t.co/0U2xsZNexE
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







