భారత్ దేశ రాష్ట్రాల్లో ఉగ్రముప్పు..

- January 27, 2016 , by Maagulf
భారత్ దేశ రాష్ట్రాల్లో ఉగ్రముప్పు..

ఈరోజు ఉదయం సమావేశమైన కేంద్రమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాద ముప్పు పొంచివున్న రాష్ట్రాల్లో భద్రత పెంచాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్‌తో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు 17 రిజర్వు బెటాలియన్లు పంపాలని నిర్ణయించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటయ్యే కేంద్ర ప్రత్యేక బలగాల్లో నియామకాలపై నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ముందు లొంగిపోయిన, ప్రభుత్వానికి సహకరిస్తున్న వారిని నియమించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ ఆధీకృత మూలధనం వెయ్యికోట్ల నుంచి రూ.1200 కోట్లకు పెంచేందుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com