సౌదీ అరేబియా: జెడ్డా మెయరాల్టీలో 50 వేల కార్మికులకు చెకప్
- April 15, 2020
సౌదీ అరేబియా:కరోనా వైరస్ వ్యాప్తని అరికట్టేందుకు ప్రతీ అంశంలోనూ సౌదీ అరేబియా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇక వలస కార్మికులకు కేటాయించిన గదుల్లో ఎక్కువ మంది ఉండటాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. దీంతో కార్మికులు ఉండే గదుల్లో సామాజిక దూరం అమలయ్యేలా చర్యలు చేపడుతోంది. వివిధ గవర్నరేట్ వారి నివాస సదుపాయలను కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జెడ్డా మేయరాల్టి తమ పరిధిలో కార్మికుల నివాస సముదాయాల కోసం దాదాపు 531 ప్రదేశాలతో జాబితా సిద్ధం చేసింది. 23 ప్రభుత్వ స్కూళ్లలో 1,962 మందికి వసతి సౌకర్యం కల్పించింది. అలాగే మేయర్ కార్యాలయ అధికారులు కార్మికుల నివాస ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 220 ప్రాంతాల్లో పర్యటించి దాదాపు 55 వేల మంది కార్మికులను చెకప్ చేశారు. వారు ఉండే గదులు, నివాస ప్రాంతాల్లో క్రిమి సంహారక చర్యలు చేపట్టినట్లు మేయర్ కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







