కువైట్లో గురువారం నుంచి భారతీయులకు ఆమ్నెస్టీ(క్షమాబిక్ష)
- April 15, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం ఇచ్చిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ను ఉపయోగించుకోవలసింది గా భారత రాయ బార కార్యాలయం కొద్ది సేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 16 వ తేది(గురువారం) నుండి 20 వ తేది(సోమవారం) వరకు ఉదయం 08 గంటల నుండి మధ్యాహ్నం 02 గంటల వరకు ఫర్వానియ గవర్నరేట్ లోని ముత్తన్న ప్రైమరీ స్కూల్ ఫర్ బాయ్స్ బ్లాక్ 1 స్ట్రీట్ 122 లో మగ వారు నమోదు చేసుకోవాలి. మహిళలు ఫర్వానియ గవర్నరేట్ లోని ఫర్వానియ ప్రైమారి స్కూల్ ఫర్ గర్ల్స్ బ్లాక్ 1 స్ట్రీట్ 76 లో నమోదు చేసుకోవాలి. అలాగే జేలీబ్ అల్ షువైక్ లో నయీం బిన్ మసౌద్ స్కూల్ బాయ్స్ బ్లాక్ 4 స్ట్రీట్ 250 లో మగ వారికి, రుఫిడా అల్-అస్లమియా ప్రైమరీ స్కూల్ బ్లాక్ 4 స్ట్రీట్ 200 లో మహిళలకు కేటాయించారు.
ట్రావెల్ పత్రాలు అంటే పాస్ పోర్ట్ ఉన్నవారందరూ కుడా పైన పేర్కొన్న సెంటర్లకు వెళ్ళాలి. వీరందరూ వారికి సంభందించిన లగేజ్ మొత్తం సర్దుకొని వెంట తీసుకు వెళ్ళవలసి ఉంటుంది. వారి నమోదు పక్రియ కాగానే వారిని షెల్తర్లకు తరలిస్తారు. అక్కడ నుండి నేరు గా వారిని భారత దేశానికి తరలిస్తారు. ఎప్పుడు వారి ప్రయాణం ఉంటుందో ఇరు దేశాల ద్వైపాక్షిక సంభందాల మిధ ఆధార పడి ఉంటుంది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







