సానియా మీర్జ,-ఇవాన్ డోడిగ్ జోడి సెమీ ఫైనల్ కు..
- January 28, 2016
ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడి సెమీ ఫైనల్ కు చేరింది. గురువారం జరిగిన మిక్స్ డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా జంట 7-6(1), 6-3 తేడాతో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) పై గెలిచి సెమీస్ లోకి ప్రవేశించారు.ఒక గంటా 13 నిమిషాల పాటు జరిగిన పోరులో సానియా-డోడిగ్ ద్వయం పదునైన ఏస్ లతో ఆకట్టుకుంది. తొలి సెట్ టై బ్రేక్ కు దారి తీసినా సానియా-డోడిగ్ లు ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా హింగిస్-పేస్ పై పైచేయి సాధించి ఆ గేమ్ ను కైవసం చేసుకున్నారు. ఆ తరువాత కూడా అదే ఊపును కొనసాగించడంతో సానియా-డోడిగ్ జోడి సెమీస్ కు చేరింది.తమ తదుపరి పోరులో ఎలెనా వెస్నినా(రష్యా)- బ్రోనో సోర్స్(బ్రెజిల్) జంటతో సానియా-డోడిగ్ జోడి తలపడనుంది.2009 లో మహేష్ భూపతి కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను సానియా చివరిసారి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహిళల డబుల్స్ విభాగంలో హింగిస్ తో కలిసి ఫైనల్ కు చేరిన సానియా మరో టైటిల్ కు ఒక అడుగు దూరంలో నిలిచింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







