రోడ్డు ప్రమాదంలో 14 మంది వలస కార్మికులు దుర్మరణం
- May 14, 2020
లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి సొంతూరికి ప్రయాణమైన వలస కూలీలను రోడ్డు ప్రమాదాలు బలితీసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది వలస కూలీలు ప్రాణాలు కొల్పోయారు. మధ్యప్రదేశ్ లో వలస కూలీలు ప్రయాణిస్తున్న లారీని ఓ బస్సు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. యూపీకి చెందిన వలస కూలీలు మహారాష్ట్ర నుంచి ఓ లారీలో బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మరో ప్రమాదంలో బీహార్ కు చెందిన ఆరు వలస కూలీలు మృతి చెందారు. వీళ్లంతా పంజాబ్ నుంచి తమ స్వస్థలాలకు బయల్దేరారు. అయితే.. యూపీకి చెందిన ఆర్టీసీ బస్సు వలస కూలీలపై దుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







