తెలంగాణలో కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు
- June 11, 2020
హైదరాబాద్:తెలంగాణలో గురువారం ఒక్కరోజే 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 4,320కు చేరింది. మొత్తంగా 165 మంది ప్రాణాలు కోల్పోగా, 1,993 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,162 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా వచ్చిన కేసుల్లో 175 GHMC పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో మేడ్చల్ జిల్లాలో 10, రంగారెడ్డిలో 7, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో 3, సిద్దిపేట, కొమురం భీం(ఆసిఫాబాద్), వరంగర్ అర్బన్ జిల్లాల్లో 2, ములుగు, కామారెడ్డి, వరంగల్(రూరల్), రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో 1, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







