నేను పోరాడేది ప్రజల కోసం: పవన్‌

- February 01, 2016 , by Maagulf
నేను పోరాడేది ప్రజల కోసం: పవన్‌

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగిన ఘటన చాలా బాధ కలిగించిందని జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. 'రైలు తగలబెట్టడం వంటి ఘటనలు చూసి బాధ అనిపించింది. నిన్న ఉదయమే కేరళ వెళ్లాను, షూటింగ్‌ సగంలో ఆపి వచ్చేశాను. శాంతియుతంగా ఉంటేనే ఉద్యమం విజయవంతం అవుతుంది. ఏ సమస్య అయినా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో తప్పు లేదు. కానీ శాంతియుతంగా ఉండాలి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు ఉంటాయి గానీ శాంతియుతంగా ఉంటాయి. అయితే నిన్న జరిగిన ఘటన ప్రణాళిక ప్రకారం జరిగింది. దీని వెనుక సంఘ విద్రోహకశక్తులు ఉండి ఉంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com