ముంబైలో తెలంగాణ వలసకార్మికుల సమావేశం
- February 01, 2016
ముంబైలోని ఆంధ్ర మహాసభ హాల్ నందు ఆదివారం (31 జనవరి 2016) తెలంగాణ వలసకార్మికుల సేవాసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 'గల్ఫ్ తెలంగాణ' అధికార ప్రతినిధి పట్కూరి బసంత్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల క్రితం మహారాష్ట్ర కు బతుకుదెరువుకోసం వచ్చిన తెలంగాణవారు స్థానిక మరాటీ ప్రజలతో కలిసి మెలిసి ఉంటున్నారని, మహారాష్ట్ర సంస్కృతితో మమేకమై, తమ తెలంగాణ భాషా, సంస్కృతులను కాపాడుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ వలసకార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం తాను తెలంగాణ ప్రభుత్వ పెద్దలను కలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బసంత్ రెడ్డిని 'ముంబై-తెలంగాణ' వలసకార్మికుల కోఆర్దినేటర్ గా నియమించి సన్మానించారు. ఈ సమావేశంలో నల్ల రాధా కృష్ణ, మచ్చ ప్రభాకర్, రవీందర్, బత్తుల లింగం, 'తెలంగాణ జాగృతి' మహారాష్ట్ర విభాగం కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని 'గల్ఫ్ తెలంగాణ' అధికార ప్రతినిధి పట్కూరి బసంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







