కరోనా తో హడలిపోతున్న బీజింగ్
- June 16, 2020
బీజింగ్: చైనా రాజధాని పరిస్థితి దారుణంగా ఉందని సాక్షాత్తూ అధికారి ప్రతినిధి బహిరంగ వ్యాఖ్యలు చేశారంటే అక్కడి స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్థానిక జింన్ఫాడీ మార్కెట్ తాజాగా కరోనా కేసులకు కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. కరోనాను అదుపులోకి తెచ్చామని ఊపిరి పీల్చుకుంటున్న చైనా.. జింన్ఫాడీలో కరోనా కేసులు వేలుగు చూడటంతో ఒక్కసారిగి ఉల్లిక్కిపడింది. కరోనా మరోసారి వీపరీతంగా వ్యాపిస్తుందేమోనని స్థానిక ప్రభుత్వం భయపడిపోయింది. దురదృష్టవశాత్తూ అనుకున్నదంతా జరిగింది. కేవలం ఐదు రోజుల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రోజుకు సగుటున పదుల సంఖ్యలో కొత్త కేసుల చూడటంతో ప్రస్తుతం బీజింగ్లో కరోనా కేసుల సంఖ్య 106కి చేరింది. మంగళవారం నాడు కూడా ఏకంగా 27 కొత్త కేసులు నమోదయ్యాయి.
పరిస్థితి చేయిదాటుతోందని అంతకుమునుపే గ్రహించిన ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రజలకు సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే రాజదానిలో దాదాపు 30 ప్రాంతాలను పూర్తిగా లాక్ డౌన్ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి విషమంగా ఉందంటూ అధికార ప్రతినిధి బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో ప్రపంచ దేశాలన్నీ మరో కుదుపునకు లోనయ్యాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. బీజింగ్ నగర విస్తీర్ణం, జనాభా, దేశంలోని ఇతర ప్రాంతాలతో నగరాన్ని కున్న సంబంధం వంటివాటి దృష్ట్యా ప్రభుత్వం అక్కడి పరిస్థితిని తక్షనం అదుపులోకి తేవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







