తెలంగాణ:కొత్తగా 1087 కరోనా కేసులు
- June 27, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోన వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం కొత్తగా 1087మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13436 కి చేరింది. ఇప్పటివరకు 4928 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక శనివారం కరోనాతో ఆరుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 243కి పెరిగింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 8265కి చేరింది. ఈ మేరకు శనివారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు అత్యధింగా జీహెచ్ఎంసీ పరిధిలో 888 కరోనా కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు