తెలంగాణ:కొత్తగా 1087 కరోనా కేసులు
- June 27, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోన వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం కొత్తగా 1087మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13436 కి చేరింది. ఇప్పటివరకు 4928 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక శనివారం కరోనాతో ఆరుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 243కి పెరిగింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 8265కి చేరింది. ఈ మేరకు శనివారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు అత్యధింగా జీహెచ్ఎంసీ పరిధిలో 888 కరోనా కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







