భారత్ లో 19,906 కొత్త కేసులు, 414 మంది మృతి
- June 28, 2020
భారత దేశమంతటా కరోనా మహమ్మారి శాంతించడం లేదు. గత 24 గంటల్లో 19,906 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,28,859కు చేరింది. మరోవైపు కరోనా సంక్రమణ కారణంగా దేశంలో మరణించిన వారి సంఖ్య 16,103 కు పెరిగింది. శనివారం 16 రాష్ట్రాల్లో 414 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 68 మంది రోగులు మరణించారు. దీంతో అక్కడ వెయ్యి మందికి పైగా మరణించారు. మహారాష్ట్రలో కొత్తగా 167 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 7,273 కు చేరింది.
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో 66 మంది రోగులు మరణించారు. దీంతో ఇక్కడ మరణాల సంఖ్య 2,558 కు పెరిగింది. ఉత్తరప్రదేశ్లో 19 మంది, గుజరాత్లో 18 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో 13, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 11, హర్యానాలో 7, మధ్యప్రదేశ్లో 4, తెలంగాణ, పంజాబ్, బీహార్, జమ్మూ కాశ్మీర్లో ఇద్దరేసి రోగులు మరణించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







