పి.వి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
- June 28, 2020హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పి.వి జ్ఞానభూమిలో ప్రారంభించారు. ఆదివారం నుంచి ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా పి.వి శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ముందుగా పి.వి చిత్రపటం వద్ద పుష్పాంజలిఘటించారు. అనంతరం భజన సంకీర్తనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పి.వి చిత్రపటం వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!