పి.వి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

- June 28, 2020 , by Maagulf
పి.వి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

హైదరాబాద్‌: మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పి.వి జ్ఞానభూమిలో ప్రారంభించారు. ఆదివారం నుంచి ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా పి.వి శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ముందుగా పి.వి చిత్రపటం వద్ద పుష్పాంజలిఘటించారు. అనంతరం భజన సంకీర్తనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పి.వి చిత్రపటం వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com