భద్రతా కారణాలతో స్కూల్ మూసివేత
- February 02, 2016
అబుదాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎడిఇసి) ఘయాతిలోని వెస్టర్న్ మోడల్ ప్రైవేట్ స్కూల్ మూసివేతకు నిర్ణయం తీసుకుంది. భద్రతా ప్రమాణాల పరంగా అత్యంత అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలోనే ఈ స్కూల్ని మూసివేయాలని నిర్ణయించారు. ఎడిసిఇ ఓ ప్రకటనలో, ప్రైవేట్ స్కూల్స్ మరియు క్వాలిటీ ఎష్యూరెన్స్ (పిఎస్క్యుఎ) విభాగంలో స్కూల్తో అత్యవసరమైన నిర్వహణకు సంబంధించి చర్చలు జరిపింది. అలాగే స్కూల్ తమ సౌకర్యాలను మెరుగుపరచుకోవాల్సిందిగా ఆదేశించింది. ఎడిఇసి రూపొందించిన 2015 టెక్నికల్ రిపోర్ట్ ద్వారా స్కూల్ స్ట్రక్చర్ వెరీ పూర్ కండిషన్లో ఉందనీ దాంతో, అత్యంత దారుణమైన భద్రతా ప్రమాణాలున్నట్లుగా డిక్లేర్ చేయడమయ్యిందని అధికారులు చెప్పారు. 2015 జులో 20న మూసివేత డిక్రీ జారీ అయ్యింది. 2016-17 సంవత్సరానికి సంబంధించి ఈ మూసివేత నిర్ణయం అమల్లో ఉంటుంది. మూసివేత కారణంగా 502 మంది విద్యార్థులు ఇబ్బందులు పడనున్నారని గుర్తించి, వారికి వివిధ స్కూళ్ళలో ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించారు. 216 మంది ఎమిరేటీ, అరబ్ స్టూడెంట్సని దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలో, 282 మంది ఏసియన్ స్టూడెంట్స్కి ప్రైవేట్ స్కూళ్ళలో ప్రవేశం ఇచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







