రేపటి నుంచి పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న దుబాయ్
- July 06, 2020
దుబాయ్:కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ అనంతరం సుమారు మూడు నెలల తర్వాత పర్యాటకులకు దుబాయ్ స్వాగతం పలుకుతోంది. రేపటి నుంచి పర్యాటకులను దుబాయ్ లోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది.అందుకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేసింది. కరోనా నేపథ్యంలో పర్యాటకులు సమర్పించాల్సిన పత్రాలను ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. క్వారెంటైన్ బాధలు లేకుండా దుబాయ్ అంతటా తిరగడానికి అవసరమైన పత్రాల కోసం ఒక్కసారి ఈ వార్తలోకి లుక్కేయండి. దుబాయ్ కి వెళ్లే పర్యాటకులకు కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ప్రయాణానికి 96 గంటల ముందు గుర్తింపు పొందిన ల్యాబ్లో టూరిస్ట్.. కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ప్రయాణికుడు ఒకవేళ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించకపోతే..దుబాయ్ లోని విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో సదరు ప్రయాణికుడు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పరీక్షా ఫలితాలు వచ్చే వరకు సదరు ప్రయాణికుడు క్వారెంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రయాణానికి ముందే టూరిస్ట్.. కరోనాకు వర్తించే ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. సదరు ప్రయాణికుడికి ట్రావెల్ ఇన్సూరెన్స్ లేనట్లయితే.. ఒకవేళ తమకు కరోనా లక్షణాలు బయటపడితే.. దాని చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తామంటూ పర్యాటక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. టూరిస్ట్ జాతీయతను బట్టి.. దుబాయ్, వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ సౌకర్యం లేని దేశస్తులు ప్రయాణానికి ముందు దుబాయ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో విజిట్ వీసా పొందాలి. అంతేకాకుండా ప్రయాణానికి ముందే టూరిస్టులు COVID-19 DXB యాప్ను డౌన్లోడ్ చేసుకుని, అందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్యాటకునకు కరోనా లక్షణాలు ఉన్నట్లు దుబాయ్ అధికారలు భావిస్తే.. సదరు పర్యాటకునకు విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







