ఏ.పీ లో కొత్తగా 1,919 కరోనా పాజిటివ్ కేసులు
- July 13, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో19,247 సాంపిల్స్ ని పరీక్షించగా 1,919 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.అలాగే కొత్తగా 1030 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ అరోగ్యంతో డిశ్చార్ట్ అయ్యారు.కోవిడ్ వల్ల అనంతపూర్ లో ఆరుగురు, కర్నూల్ లో నలుగురు. తూర్పు గోదావరి లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, చిత్తూర్ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, కృష్ణలో ముగ్గరు,ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు. నెల్లూరు లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు, విజయనగరం లో మరొకరు మరణించారు. నేటివరకు రాష్ట్రంలో 11,73,096 సాంపిల్స్ ని పరీక్షించారు. రాష్ట్రంలో 11,958 మంది ఆసుపత్రులలో మరియు 2,316 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో వెరసి మొత్తం 14,274 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 28,255 పాజిటివ్ కేసు లకు గాను.. 14,275 మంది డిశ్చార్జ్ కాగా.. 365 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 13,615 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- ఇరాన్ కు వ్యతిరేకంగా..ఐసీఏఓ వద్ద కువైట్ సెకండ్ ప్రొటెస్ట్..!!
- బార్కాలో ఒక వాణిజ్య సంస్థ మూసివేత..!!









