పోలీసులు అజీజ్ను నేడు కోర్టులో హాజరుపరుచనున్నారు
- February 04, 2016
నేడు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు లక్నోలో పట్టుబడిన ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ను గురువారం రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. పోలీసులు అజీజ్ను శుక్రవారం కోర్టులో హాజరుపరుచనున్నారు. భవానీనగర్కు చెందిన అబ్దుల్అజీజ్ 12 ఏండ్లుగా సౌదీఅరేబియాలో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. ఇతడిపై హైదరాబాద్ ఆలయం పేల్చివేతకు కుట్రతోపాటు నకిలీపాస్పోర్టు కేసు కూడా నమోదై ఉంది. ఈ కేసులు నమోదైన తర్వాత 2004లో సౌదీఅరేబియాకు పారిపోయాడు. అప్పటినుంచి పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు. సౌదీఅరేబియాలో ఉన్న అజీజ్ను ఇంటర్పోల్ సహాయంతో దేశానికి రప్పించారు. మంగళవారం లక్నో చేరుకున్న ఇతడిని అక్కడి యాంటీ టెర్రరిస్టు స్కాడ్ అదుపులోకి తీసుకుంది.ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు అక్కడి కోర్టు అనుమతితో గురువారం హైదరాబాద్కు తీసుకొచ్చారు. కోర్టులో రిమాండ్ అనంతరం తిరిగి విచారణ నిమిత్తం కోర్టు అనుమతి అదుపులోకి తీసుకోనున్నట్టు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (సిట్) పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







