పోలీసులు అజీజ్ను నేడు కోర్టులో హాజరుపరుచనున్నారు
- February 04, 2016నేడు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు లక్నోలో పట్టుబడిన ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ను గురువారం రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. పోలీసులు అజీజ్ను శుక్రవారం కోర్టులో హాజరుపరుచనున్నారు. భవానీనగర్కు చెందిన అబ్దుల్అజీజ్ 12 ఏండ్లుగా సౌదీఅరేబియాలో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. ఇతడిపై హైదరాబాద్ ఆలయం పేల్చివేతకు కుట్రతోపాటు నకిలీపాస్పోర్టు కేసు కూడా నమోదై ఉంది. ఈ కేసులు నమోదైన తర్వాత 2004లో సౌదీఅరేబియాకు పారిపోయాడు. అప్పటినుంచి పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు. సౌదీఅరేబియాలో ఉన్న అజీజ్ను ఇంటర్పోల్ సహాయంతో దేశానికి రప్పించారు. మంగళవారం లక్నో చేరుకున్న ఇతడిని అక్కడి యాంటీ టెర్రరిస్టు స్కాడ్ అదుపులోకి తీసుకుంది.ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు అక్కడి కోర్టు అనుమతితో గురువారం హైదరాబాద్కు తీసుకొచ్చారు. కోర్టులో రిమాండ్ అనంతరం తిరిగి విచారణ నిమిత్తం కోర్టు అనుమతి అదుపులోకి తీసుకోనున్నట్టు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (సిట్) పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!