గెలుపుతో తెరాస కొత్త చరిత్రకు శ్రీకారం
- February 05, 2016
తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించామని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గొప్ప గెలుపుతో తెరాస కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ అపూర్వ విజయం అందించిన ప్రజలకు శిరస్సు వంచి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని చిత్తశుద్ధితో అమలుచేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. ఈ గెలుపుతో తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు.ఈ ఎన్నికల్లో గెలుపునకు కృషిచేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అన్నింటికీ మించి అఖండమైన రీతిలో ప్రజలు తమను ఆదరించినందునే ఈ విజయం సాధ్యమైందన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేశామన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









