గెలుపుతో తెరాస కొత్త చరిత్రకు శ్రీకారం

- February 05, 2016 , by Maagulf
గెలుపుతో తెరాస కొత్త చరిత్రకు శ్రీకారం

తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించామని ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గొప్ప గెలుపుతో తెరాస కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ అపూర్వ విజయం అందించిన ప్రజలకు శిరస్సు వంచి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని చిత్తశుద్ధితో అమలుచేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. ఈ గెలుపుతో తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు.ఈ ఎన్నికల్లో గెలుపునకు కృషిచేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అన్నింటికీ మించి అఖండమైన రీతిలో ప్రజలు తమను ఆదరించినందునే ఈ విజయం సాధ్యమైందన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేశామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com