ఐపీఎల్‌ తొమ్మిదో సీజన్‌ ఆటగాళ్ల ఎంపికకు వేలం

- February 05, 2016 , by Maagulf
ఐపీఎల్‌ తొమ్మిదో సీజన్‌ ఆటగాళ్ల ఎంపికకు వేలం

 ఐపీఎల్‌-9 కోసం ఆటగాళ్ల ఎంపికకు వేలం ఈరోజు ఉదయం బెంగళూరులో ప్రారంభమైంది. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్‌ తొమ్మిదో సీజన్‌ మొదలవనున్న నేపథ్యంలో ఈరోజు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. వేలంలో 351 మంది ఆటగాళ్లను 10జట్లు ఎంచుకోనున్నాయి. ముందుగా పూణె సూపర్‌ గెయిన్ట్స్‌ వేలాన్ని ప్రారంభించింది. ఇంగ్లాండ్‌కి చెందిన కెవిన్‌ పీటర్సన్‌ని రూ.3.5 కోట్లకు, భారత క్రికెటర్‌ ఇషాంత్‌ శర్మని రూ.3.8కోట్లకు పూణె సూపర్‌ గెయిన్ట్స్‌ దక్కించుకుంది. రూ.9.5కోట్లకు షేన్‌ వాట్సన్‌ను బెంగళూరు ఛాలెంజర్స్‌, 2.3కోట్లకు డ్వేస్‌ స్మిత్‌ను గుజరాత్‌ లయన్స్‌ సొంతం చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com