75 మంది ఉగ్రవాదులు హతo...
- February 09, 2016
ఇరాక్లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతమైన రమాదిలో సోమవారం 75 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతాదళాలు వెల్లడించాయి. రమాదిలో ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న రెండు ప్రాంతాలను ఇరాక్ ప్రభుత్వ భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. రమాదికి పది కిలోమీటర్ల దూరంలో హుసైబా అల్-షర్ఖియా ప్రాంతంలో భద్రతాదళాలు ఉగ్రవాదులతో పోరాడాయి. అయిదుగురు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దాదాపు 43 మంది మరణించగా, ఏడుగురు ఉగ్రవాదులు ప్రాణాలతో పట్టుబడ్డారు. నలుగురు భద్రతా సిబ్బంది మరణించగా, 12 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.రమాది తూర్పు ప్రాంతంలోని జువిబాలో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో 25 మంది ఉగ్రవాదులు హతం కాగా, ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాటం తర్వాత జువిబా జిల్లాలో పలు భవనాలపై ఇరాక్ దేశ జెండాను ఎగురవేశారు. రమాది నగరాన్ని ఐఎస్ ఉగ్రవాదులు గత ఏడాది స్వాధీనం చేసుకున్నారు. దానిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







